
నీట్ పీజీ ప్రశాంతం
సూర్యాపేట : నీట్ పీజీ(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్గ్రాడ్యుయేట్) జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. ఆదివారం సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న నీట్ పీజీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో 179 అభ్యర్థులకు గాను 171 మంది హాజరయ్యారని, 8 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే కోదాడ సన ఇంజనీరింగ్ కాలేజీలో 50 మందికి గాను 44 మంది హాజరయ్యారని, ఆరుగురు గైర్హాజరయ్యారని వివరించారు. ఆయన వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జయలత, తహసీల్దార్ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

నీట్ పీజీ ప్రశాంతం