మండలంలో రాత్రి వేళల్లో విపరీతంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ సమస్య తీవ్రంగా పరిణమిస్తోందని ఆంధ్రప్రదేశ్ మహి ళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఆరేలమ్మ ఆరోపించారు. ఈ మేరకు ఉప్పలాం పంచాయతీలో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. విద్యుత్ కోతలతో బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కోతల నుంచి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. –సోంపేట


