శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇజ్రాయిల్లో ఒప్పంద ప్రాతిపదికన నర్సింగ్ సెక్టార్–6ఎలో పనిచేసేందుకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తు లు కోరుతున్నట్లు జిల్లా ఎస్సీ కులాల సేవా సహకా ర సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) కె.వినాయకం శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి, 25 నుంచి 45 ఏళ్ల లోపు వయసున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 1,99,700 చొప్పు న వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, నర్సింగ్ స్కిల్స్తో పాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు మొబైల్ నంబరు 97048 95271లో సంప్రదించాలని ఈడీ కోరారు.


