ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

Jul 17 2026 7:33 AM | Updated on Jul 17 2026 7:33 AM

టెక్కలి రూరల్‌: స్థానిక జగతి మెట్ట సమీపంలో నివాసముంటున్న ధవళ అనిత(43) అనే అనే వివాహిత బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అనిత విజయనగరం జిల్లా జీఎస్టీ కార్యాలయం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త జన్ని హరి సంతబొమ్మాళి మండలంలో డీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ జగతిమెట్ట సమీపంలో నివాసముంటున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని క్లూస్‌ టీం పరిశీలించిన తర్వాత శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మృతురాలికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నా డు. అనంతరం టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement