శ్రీకాకుళం: రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ఆందోళన చేపట్టనున్నట్లు ఏపీటీఎఫ్ నాయకుడు మామిడి భుజంగరావు, బుక్కురు వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు 80 అడుగుల రోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభించి, కలెక్టర్ కార్యాలయం వద్ద పికెటింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
శ్మశానవాటిక ఆక్రమణపై ఫిర్యాదు
రణస్థలం: మండల కేంద్రంలోని జేఆర్పురం పంచాయతీ దన్నానపేట గ్రామానికి చెందిన శ్మశానవాటికను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని గ్రామస్తులు తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 211–1లో గెడ్డ వాగును గత 50 ఏళ్లుగా శ్మశానవాటికగా వాడుతున్నామన్నారు. ప్రస్తుతం ఆ గెడ్డవాగును కప్పేసి పంట పొలాలుగా మార్చేస్తున్నారని, శ్మశానవాటిక, గెడ్డవాగుకు హద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించాలని కోరారు. ఈ ఫిర్యాదు చేసినవారిలో దన్నాన లక్ష్మణరావు, దన్నాన శ్రీరామ్, సత్య, దినేష్ కుమార్, సాయి, తేజ తదితరులు ఉన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్కు 88 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ (ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక)కు 88 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో పరిష్కారం అయ్యేలా చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు.


