రావిచెట్టు పడి మూడు ఇళ్లు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

రావిచెట్టు పడి మూడు ఇళ్లు ధ్వంసం

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

నాలుగు విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో నిలిచిన విద్యుత్‌ సరఫరా

నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేట పరిధిలోని ఆదివరపుపేటలో శనివారం రావిచెట్టు కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్‌ వైర్లపై పడటంతో నాలుగు విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. బోయిన జనార్దనరావు, తంగుడు ఆంజనేయులు, తంగుడు కృష్ణ, సుబుద్ధిల ఇళ్లపై చెట్టుకొమ్మలు పడటంతో గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాలేదు. పంచాయతీ, విద్యుత్‌ సిబ్బంది స్పందించి చెట్లు కొమ్మలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు.

ఐటీఐ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఎచ్చెర్ల : ఐటీఐలలో ప్రవేశాలకు సంబంధించి ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో శనివారం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. మొదటి రోజు 584 మందిని పిలవగా 255 మంది హాజరయ్యారు. వీరిలో 141 మందికి సీట్లు కేటాయించారు. ఆదివారం కూడా కౌన్సెలింగ్‌ కొనసాగించనున్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకర్‌, చిట్టి నాగభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement