మట్టి మాఫియా చెలరేగిపోతోంది. చెరువుల్లో సైతం మట్టి తరలిస్తుంటే సంబంధిత ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోకపోవడం అన్యాయం. మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖాధికారులు సమన్వయంతో పని చేస్తే ఒక్క మట్టి రేణువుకూడా అక్రమార్కులు అమ్ముకోలేరు. ఇప్పటికై నా అధికారులు మొద్దునిద్ర వీడాలి.
– కదిరెప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
చర్యలు తీసుకుంటాం
ఎక్కడైనా మట్టి అక్రమ రవాణా చేస్తుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆరు మండలాల తహసీల్దార్లకు ఆదేశాలిస్తాను. మైనింగ్ వాళ్ల అనుమతి లేకుండా మట్టిని తరలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. యంత్రాలను సైతం సీజ్ చేసి భారీ జరిమానాలు విధించేందుకు కూడా వెనుకాడం. మట్టి తరలించే వారు ఎంతటి వారైనా వదలేదిలేదు.
– కళావతి,
ఆర్డీఓ, కదిరి


