చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ సీమకు అన్యాయమే జరుగుతోంది. దివంగత నేత వైఎస్సార్ పోతిరెడ్డిపాడును 88 వేల క్యూసెక్కుల స్థాయికి పెంచితే చంద్రబాబు అడ్డుపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 శాతం పూర్తి చేస్తే ఆ పనులకూ అడ్డు తగిలారు. చంద్రబాబుతో మాట్లాడి ఈ ప్రాజెక్టు పనులను ఆపేయించానని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినా ఖండించ లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం పోరాటం ఉధృతం చేస్తాం.
–కాటసాని రాంభూపాల్ రెడ్డి,
వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు


