ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని | What Was The Device MS Dhoni Was Seen Wearing In India vs England 1st ODI | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

Jul 15 2026 2:58 PM | Updated on Jul 15 2026 3:10 PM

What Was The Device MS Dhoni Was Seen Wearing In India vs England 1st ODI

Photo Credit : Screengrab

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేను భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సతీసమేతంగా వీక్షించాడు. ఈ సందర్భంగా ధోని చెవిలో కనిపించిన ఓ పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పరికరం ఏంటని అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.

పరిశోధనల అనంతరం దాని రేడియో ఇయర్‌విగ్ (Radio Earwig) అని తెలిసింది. ఇది ఒక చిన్న వైర్‌లెస్ రేడియో రిసీవర్. దీని ద్వారా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ జరుగుతుండగానే ప్రత్యక్ష రేడియో కామెంటరీని వినొచ్చు.

రేడియో ఇయర్‌విగ్ ప్రత్యేకతలు

* ప్రత్యక్ష రేడియో కామెంటరీ వినేందుకు ఉపయోగించే చిన్న పరికరం.
* సుమారు 20 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది.
* ఇంగ్లండ్‌లో దీని ధర సుమారు 20 పౌండ్లు.
* లార్డ్స్ సహా ఇంగ్లండ్‌లోని పలు ప్రముఖ స్టేడియాల్లో అభిమానులకు విక్రయిస్తారు.
* క్రికెట్‌తో పాటు ఫార్ములా-1, గుర్రపు పందేలు, రగ్బీ వంటి క్రీడల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు.

ధోనీ ఒక్కరే కాదు
గతంలో భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కూడా ఇంగ్లండ్ పర్యటనలో డ్రెస్సింగ్‌రూమ్‌లో కూర్చొని ఈ రేడియో ఇయర్‌విగ్ ద్వారా ప్రత్యక్ష కామెంటరీ విన్నారు. అలాగే రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ కూడా ఈ పరికరాన్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి.

భారత్‌లో ఎందుకు కనిపించదు..?
భారత్‌లో క్రికెట్‌కు సంబంధించిన రేడియో ప్రసారాలు ప్రస్తుతం పెద్దగా ప్రాచుర్యంలో లేకపోవడంతో స్టేడియాల్లో ఈ పరికరాలు అందుబాటులో ఉండవు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో రేడియో కామెంటరీ ఇప్పటికీ ప్రజాదరణ పొందినందున అక్కడి స్టేడియాల్లో రేడియో ఇయర్‌విగ్ వినియోగం కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే, తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌ 45.2 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత గెలుపులో అక్షర్‌ పటేల్‌ (4 వికెట్లు, 57 నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల​్‌ (80 రిటైర్డ్‌ హర్ట్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (52 నాటౌట్‌) కీలకపాత్ర పోషించారు. రెండో వన్డే కార్డిఫ్‌ వేదికగా జులై 15న జరుగనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement