IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే... కుల్దీప్‌కు చోటు! చాహల్‌కు నో చాన్స్‌

Wasim Jaffer predicts Indias XI for 1st ODI - Sakshi

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్‌ తలపడేందుకు సిద్దమైంది. ఈ కీలక పోరు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కివీస్‌తో తొలి వన్డేలో తలపడే టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్ అంచనా వేశాడు. తను అంచనా వేసిన జట్టులో ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, శుభ్‌మాన్ గిల్‌కు అవకాశం ఇచ్చాడు.

వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో విరాట్‌ కోహ్లి, ఇషాన్‌ కిషన్‌ను జాఫర్‌ ‍ఎంపిక చేశాడు. అదే విధంగా ఐదో స్థానంలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు దక్కింది. ఇక ఆలౌరౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌ను అతడు ఎంపికచేశాడు.

ఇక ఈ జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా చాహల్‌ను కాదని కుల్దీప్‌ యాదవ్‌కు అతడు చోటిచ్చాడు. ఫాస్ట్‌ బౌలర్ల విభాగంలో సిరాజ్‌, మహ్మద్‌ షమీ, ఉమ్రాన్‌ మాలిక్‌ స్థానం దక్కించుకున్నారు.

తొలి వన్డేకు వసీం జాఫర్ అంచనా వేసిన భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మాన్‌ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్
చదవండి
: IND Vs NZ: న్యూజిలాండ్‌తో తొలి పోరు.. భారత్‌ జోరు కొనసాగేనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top