Vinukonda Young Man Wins Gold Medal In Running - Sakshi
Sakshi News home page

వినుకొండ యువకుడి ప్రతిభ: పరుగు పందెంలో పసిడి పతకం!  

Aug 13 2021 11:34 AM | Updated on Aug 13 2021 12:24 PM

Vinukonda Young Man Wins Gold Medal In Running - Sakshi

బంగారు పతకంతో షేక్‌ అబ్దుల్లా

అంతర్జాతీయ పోటీల్లో గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన షేక్‌ అబ్దుల్లా 5 కిలో మీటర్ల పరుగు పందెం విభాగంలో తొలి స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించాడు.

వినుకొండ (నూజెండ్ల): అంతర్జాతీయ పోటీల్లో గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన షేక్‌ అబ్దుల్లా 5 కిలో మీటర్ల పరుగు పందెం విభాగంలో తొలి స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. భూటాన్‌లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు 3వ సౌత్‌ ఏషియన్‌ రూరల్‌ గేమ్స్‌ జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 4 దేశాల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, అబ్దుల్లా గతంలో కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో యూత్‌ రూరల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన జాతీయస్థాయి రన్నింగ్‌ పోటీల్లో 2 సార్లు, అంతర్జాతీయ స్థాయిలో నేపాల్‌లో జరిగిన పోటీల్లో 2 సార్లు గోల్డ్‌ మెడల్‌ సాధించాడు.

ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే....  
అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే ముందు అబ్దుల్లా ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం అబ్దుల్లాకు రూ. 50 వేల ఆర్థికసాయాన్ని చేసింది. ఈ మొత్తాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సమక్షంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అబ్దుల్లాకు అందజేశారు. దీనిపై అబ్దుల్లా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రోత్సహిస్తే 2024 ఒలింపిక్స్‌లో కూడా ప్రతిభ కనబరుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.      

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement