జైపూర్: జాతీయ సబ్ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ పతకాల బోణీ కొట్టింది. గురువారం ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు గ్రూప్–2 బాలికల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో శివాని కర్రా రజత పతకం సొంతం చేసుకుంది. శివాని 200 మీటర్ల లక్ష్యాన్ని 2 నిమిషాల 26.71 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. «200 మీటర్ల ఫ్రీస్టయిల్లో శివాని 2ని:11.30 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. అయితే రేసు ముగిశాక శివాని ఫాల్స్ స్టార్ట్ చేసినట్లు తేలడంతో నిర్వాహకులు ఆమెను డిస్క్వాలిఫై చేయడంతో పతకం చేజారింది.


