హన్మకొండ అర్బన్: శిక్షణలో భాగంగా ట్రెయినీ ఐఏఎస్ అధికారి సాయి శివాని సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో విధుల్లో చేరారు. ఈసందర్భంగా కలెక్టరేట్లో పలువురు అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణలో భాగంగా పరిపాలన, రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల నిర్వహణ తదితర అంశాలపై ప్రయోగిక అవగాహన పొందేందుకు ట్రెయినీ ఐఏఎస్ సాయి శివాని వివిధ శాఖల పనితీరును పరిశీలించనున్నారు.
కఠోర సాధన, అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే, సివిల్స్లో సత్తా


