Basketball Championship: రన్నరప్‌ తెలంగాణ

National Basketball Championship: Telangana Lose To Indian Railways In Final - Sakshi

National Basketball Championship Runner Up Telangana- చెన్నై: జాతీయ సీనియర్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 82–131 పాయింట్ల తేడాతో ఇండియన్‌ రైల్వేస్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. రైల్వేస్‌ తరఫున పూనమ్‌ చతుర్వేది (26 పాయింట్లు), దర్శిని (19 పాయింట్లు), పుష్ప (19 పాయింట్లు), మధు కుమారి (16 పాయింట్లు) అదరగొట్టారు.

తెలంగాణ తరఫున అన్బారసి (20 పాయింట్లు), ప్రియాంక (20 పాయింట్లు), అశ్వతి థంపి (18 పాయింట్లు) ఆకట్టుకున్నారు. పురుషుల ఫైనల్లో తమిళనాడు 87–69తో పంజాబ్‌ జట్టును ఓడించి విజేతగా నిలిచింది.

చదవండి: IPL 2022: స్టొయినిస్‌ ఆటలు సాగనివ్వని కుల్దీప్‌... లక్నో జోరుకు బ్రేక్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top