Malaysia Open 2023: క్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌

Malaysia Open 2023: HS Prannoy enters quarter-finals of Malaysia Open - Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ప్రణయ్‌ 21–9, 15–21, 21–16 స్కోరుతో చికో అరా వర్డొయో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు.  పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి కూడా క్వార్టర్స్‌కు చేరింది.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ 21–19, 22–20తో 49 నిమిషాల్లోనే షోహిబుల్‌ ఫిక్రి–మౌలానా బగస్‌ (ఇండోనేసియా)ను చిత్తు చేశారు. అయితే మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్‌ కథ ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో భారత ద్వయం పుల్లెల గాయత్రి గోపీచంద్‌ – ట్రెసా జాలీ 13–21, 21–15, 17–21 తేడాతో గాబ్రియా స్టోవా – స్టెఫానీ స్టోవా (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top