న్యూఢిల్లీ: ఐపీఎల్లో రెండు కొత్త జట్ల రాకతో 2022 సీజన్ మొత్తం 74 మ్యాచ్లతో కొత్తగా కనిపించనుంది. ఇప్పటి వరకు ప్రతీ జట్టు మిగతా 7 టీమ్లతో రెండు సార్లు తలపడి లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడేది. ఇప్పుడు కూడా ఒక్కో జట్టు గరిష్టంగా 14 మ్యాచ్లే ఆడనుండగా, ఫార్మాట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పేరుకు హోం, అవే మ్యాచ్లు అని చెబుతున్నా... టోర్నీని నాలుగు వేదికలకే పరిమితం చేయడం తో ‘సొంత మైదానం’ అనే ప్రభావం కూడా ఉండకపోవచ్చు. మొత్తం లీగ్ మ్యాచ్ల సంఖ్య 70 కాగా, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లుంటాయి. మార్చి 26 నుంచి మే 29 వరకు ఐపీఎల్ నిర్వహిస్తారు.
ఎలా ఆడతారు?
ప్రతీ జట్టు తమ గ్రూప్లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్లు, మరో గ్రూప్లోని ఒక జట్టుతో (గ్రూప్లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్లు అవుతాయి. మరో గ్రూప్లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ ‘ఎ’ గ్రూప్లోని నాలుగు టీమ్లతో పాటు గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్తో రెండు మ్యాచ్లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.
ఎక్కడ ఎన్ని మ్యాచ్లు?
70 లీగ్ మ్యాచ్లలో 20 మ్యాచ్లు ముంబై వాంఖెడే స్టేడియంలో, 20 మ్యాచ్లు ముంబై డీవై పాటిల్ స్టేడియంలో, 15 మ్యాచ్లు ముంబై బ్రబోర్న్ స్టేడియంలో, 15 మ్యాచ్లు పుణే స్టేడి యంలో నిర్వహిస్తారు. నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు అహ్మదాబాద్లో జరిగే అవకాశం ఉంది.
ఏ గ్రూప్లో ఎవరు?
ఐపీఎల్లో ఆయా జట్ల రికార్డును బట్టి ఒక్కో జట్టుకు సీడింగ్ కేటాయించారు. సాధించిన టైటిల్స్, ఫైనల్ చేరిన సంఖ్యను బట్టి దీనిని రూపొందించారు. దాని ప్రకారమే 1వ సీడ్ టీమ్ గ్రూప్ ‘ఎ’లో, రెండో సీడ్ గ్రూప్ ‘బి’లో... ఇలా పది టీమ్లను రెండు గ్రూప్లుగా విభజించారు.
గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్ (సీడింగ్–1), కోల్కతా నైట్రైడర్స్(3), రాజస్తాన్ రాయల్స్ (5), ఢిల్లీ క్యాపిటల్స్ (7), లక్నో సూపర్ జెయింట్స్ (9). గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్ (2), సన్రైజర్స్ హైదరాబాద్ (4), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6), పంజాబ్ కింగ్స్ (8), గుజరాత్ టైటాన్స్ (10).
రెండు గ్రూప్లు... జట్లకు సీడింగ్లు
Published Sat, Feb 26 2022 4:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement