
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మరోసారి నిరాశపరిచాడు. చెన్నైసూపర్ కింగ్స్తో మ్యాచ్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ముఖేష్ చౌదరి బౌలింగ్లో తొలి బంతికే ఫోర్ కొట్టిన మయాంక్.. రెండో బంతికి రాబిన్ ఊతప్పకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లోను కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మయాంక్ పెవిలియన్కు చేరాడు.
ఇప్పటి వరకు ఈ సీజన్లో మూడు మ్యాచ్లు ఆడిన మయాంక్ కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు అగర్వాల్ విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. "ఏంటి మయాంక్.. కెప్టెన్గా ఇలా ఆడితే ఇక కష్టమే" అంటూ కామెంట్ చేశాడు. కాగా ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా అగర్వాల్ ఎంపికైన సంగతి తెలిసిందే.
చదవండి: Tilak Varma: మ్యాచ్ ఓడినా మనసులు గెలుచుకున్న తెలుగు కుర్రాడు