IPL 2021, Set To Resume On September 19 Final To Be Played Oct 15 - Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ పునఃప్రారంభం

Jun 7 2021 3:38 PM | Updated on Jun 7 2021 4:32 PM

IPL 2021 Set To Resume From September 19, Final To Be Played On October 15 - Sakshi

ముంబై: కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ పునఃప్రారంభం కానుంది. భారత్‌లో కరోనా ఉధృతి తగ్గని కారణంగా ఐపీఎల్‌ సెకండాఫ్‌ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో జరగాల్సిన మిగతా 31 మ్యాచ్‌లను సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను అక్టోబర్‌ 15న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కాగా, సెకండాఫ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేరా అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే విదేశీ ఆటగాళ్లు వచ్చినా, రాకపోయినా లీగ్‌ను మాత్రం కంటిన్యూ చేస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షడు రాజీవ్‌ శుక్లా ఇటీవలే స్పష్టం చేశారు.
చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్‌ వేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement