హ్యాపీ మూమెంట్స్ ఫ్రమ్ మై ఫస్ట్ మ్యాచ్: ధనశ్రీ

దుబాయ్: ఐపీఎల్ అంటేనే బోలెడంత గ్లామర్, ఫ్యాన్స్ హంగామా, చీర్ గాళ్స్ చిందులు ఇలా అన్నీ కూడా కళ్లముందు కదులుతాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఐపీఎల్ సీజన్లో ఖాళీ స్టేడియాలు దర్శనమిస్తూ చప్పగా సాగుతున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్లో ఊహించని అతిథులు హాజరై అటు బెంగళూరు జట్టును, ఇటు వీక్షకులను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్కి కోహ్లి భార్య అనుష్క శర్మ, యజువేంద్ర చాహల్ కాబోయే భార్య ధనశ్రీ వర్మ హాజరయ్యారు. (ఏబీ... మళ్లీ)
ఈ మ్యాచ్లో బెంగళూర్ టీమ్ విజయం సాధించడంతో ధనశ్రీ వర్మ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. 'షేరింగ్ సమ్ హ్యాపీ మూమెంట్స్ ఫ్రమ్ మై ఫస్ట్ మ్యాచ్' అనే క్యాప్షన్తో బెంగళూరు జట్టు సభ్యుడు పార్థివ్ పటేల్, అనుష్క శర్మ, కమెడియన్ డానిష్ సెట్, ఇతర సభ్యులతో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను షేర్ చేశారు. ఈ మ్యాచ్లో డివిలియర్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. అయితే యూట్యూబర్, కోరియోగ్రఫర్ అయినా ధనశ్రీని త్వరలో పెళ్లాడనున్నట్లు ఆగష్టులో చహల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి