తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌ | IND VS ENG 5th T20I: updates and Highlights | Sakshi
Sakshi News home page

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

Jul 11 2026 6:41 PM | Updated on Jul 11 2026 7:46 PM

IND VS ENG 5th T20I: updates and Highlights

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
1.4వ ఓవర్‌- ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో సూర్యాంశ్‌ షేడ్గేకు క్యాచ్‌ ఇచ్చి ఫిల్‌ సాల్ట్‌ (6) ఔటయ్యాడు.

మళ్లీ టాస్‌ గెలిచిన శ్రేయస్‌.. ఈసారైనా మ్యాచ్‌ గెలిచేనా..?
శ్రేయస్‌ అయ్యర్‌ వరుసగా ఏడో మ్యాచ్‌లో టాస్‌ గెలిచాడు. ఈసారైనా మ్యాచ్‌ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టాస్‌ గెలిచిన శ్రేయస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్‌.. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో సూర్యాంశ్‌ షేడ్గే జట్టులోకి వచ్చారు.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్

7:15 గంటలకు టాస్‌
భారత జట్టు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో టాస్‌ 45 నిమిషాలు ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం 7:15 గంటలకు టాస్‌ పడుతుంది. 

టాస్‌ ఆలస్యం.. కారణమిదే..!
భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య సౌతాంప్టన్‌ వేదికగా ఇవాళ (జులై 11) ఐదో టీ20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ టాస్‌ ఆలస్యమైంది. భారత జట్టు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం చేత ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అయితే కొద్ది క్షణాల క్రితం టీమిండియా స్టేడియంకు చేరుకున్నట్లు అప్‌డేట్‌. మరికొద్ది నిమిషాల్లో టాస్‌ పడే అవకాశం ఉంది.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షం​ కారణంగా రద్దు కాగా.. తర్వాత మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలుపొందింది. ఇవాళ నామమాత్రపు చివరి మ్యాచ్‌ జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement