IND Vs SL 1st T20I: Hooda and Axar Patel Power India To 162 Runs - Sakshi
Sakshi News home page

IND vs SL: దీపక్‌ హుడా, అక్షర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. శ్రీలంక టార్గెట్‌ 163 పరుగులు

Jan 3 2023 8:53 PM | Updated on Jan 3 2023 9:11 PM

Hooda and Axar patel power India to 162 runs - Sakshi

ముంబై వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టీ20లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా పర్వాలేదనిపించింది. దీపక్‌ హుడా(41), ఇషాన్‌ కిషన్‌(37), అక్షర్‌ పటేల్‌(31) కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నస్టానికి 162 పరుగులు చేసింది. కాగా హుడా, అక్షర్‌ పటేల్‌ కలిసి 68 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇక టీ20లో అరంగేట్రం చేసిన యువ ఓపెనర్‌ శుబ్‌మాన్‌ గిల్‌(7) నిరాశపరిచాడు. అదే విధంగా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్‌ యాదవ్‌(7) కూడా సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యాడు. కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా 29 పరుగులతో రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో మధుషంక, థీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగా తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IND vs SL: అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్‌ అందించడానికా సెలక్ట్‌ చేశారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement