పాకిస్తాన్‌కు మరో షాక్‌.. సిరీస్‌ను రద్దు చేసుకున్న ఇంగ్లండ్

England Call Off Pakistan Tour - Sakshi

England Call Off Pakistan Tour : పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కి మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు సైతం రద్దు చేసుకుంది. ఆటగాళ్ల భద్రతా కారణాల దృృష్ట్యా పాకిస్తాన్‌తో  సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.  వచ్చే నెలలో ఇరు జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో  మరోసారి పాకిస్తాన్‌ పెట్టుకున్న ఆశలు అన్నీ ఆవిరయ్యాయి. భద్రతా  కారణాలతో న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే పాక్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: Ipl 2021: ముంబై ఆటగాడిపై భారత మాజీ కీపర్‌ కీలక వాఖ్యలు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top