
ముంబై: హాంకాంగ్ సిక్సెస్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్గా దినేశ్ కార్తీక్ వ్యవహరిస్తాడు. నవంబర్ 7 నుంచి 9 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఒక్కో టీమ్లో ఆరుగురు సభ్యులు ఉండి ఆరు ఓవర్ల చొప్పున సాగే ఈ ‘సిక్సెస్’ టోర్నీ 1992 నుంచి నిర్వహిస్తుండగా ప్రపంచ క్రికెట్లో దీనికి మంచి ప్రాచుర్యం లభించింది. 2005లో ఒకసారి టైటిల్ గెలిచిన భారత్ రెండు సార్లు రన్నరప్గా నిలిచింది. భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ కూడా ఈ టోరీ్నలో ఆడే అవకాశం ఉంది.