హరికృష్ణకు మూడో ‘డ్రా’ 

Chess Olympiad Tournament Starts From 25/07/2020 - Sakshi

చెన్నై: బీల్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో పెంటేల హరికృష్ణ తన ‘డ్రా’ల పరంపర కొనసాగిస్తున్నాడు. నోయెల్‌ స్టడర్‌ (స్విట్జర్లాండ్‌)తో జరిగిన పోరులో సమ ఉజ్జీగా నిలిచిన హరికృష్ణ టోర్నీలో వరుసగా మూడో డ్రా నమోదు చేశాడు. 52 ఎత్తుల తర్వాత ఈ పోరు ముగిసింది. ప్రస్తుతం 13.5 పాయింట్లతో హరి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

రేపటినుంచి చెస్‌ ఒలింపియాడ్‌ 
ఈ నెల 25న ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌ టోర్నమెంట్‌ ఆరంభం కానుంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌ పురుషుల, మహిళల విభాగాలతో పాటు జూనియర్‌ బాలుర, బాలికల విభాగాల్లో భారత్‌ పాల్గొంటుంది.  ఈ టోర్నీ  ఆగస్టు 30 వరకు జరుగుతుంది. పురుషుల జట్టులో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ ఉండగా... సారథిగా విదిత్‌ సంతోష్‌ గుజరాతి వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీలో పురుషుల ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సెన్‌ (నార్వే) పాల్గొనడం లేదు. ఇక మహిళల విభాగంలో ప్రస్తుత ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. టాప్‌–8లో నిలిచిన జట్లు స్టేజ్‌–2కు అర్హత సాధిస్తాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top