కామన్‌వెల్త్ గేమ్స్‌.. నీరజ్ చోప్రాకు రజతం | Neeraj Chopra finishes second Place in the javelin throw final gets Silver | Sakshi
Sakshi News home page

Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు రజతం.. ఇండియాకు రెండు మెడల్స్

Aug 1 2026 2:25 AM | Updated on Aug 1 2026 2:37 AM

Neeraj Chopra finishes second Place in the javelin throw final gets Silver

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత జావెలిన్ త్రోయర్స్ సత్తా చాటారు. ఒలింపిక్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ‍అయిన నీరజ్‌ చోప్రా (85.83 మీటర్లు) మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ఇవాళ జరిగిన ఫైనల్లో నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించారు. ఈ ఫైనల్‌లో  శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే  89.75 మీటర్లు విసిరి అగ్రస్థానంతో పాటు స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

ఇదే ఫైనల్లో మన దేశానికే చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ (85.41 మీ) విసిరి మూడోస్థానంలో నిలిచారు. ఈ ప్రదర్శనతో కాంస్యం పతకం దక్కించుకున్నారు. యశ్‌వీర్ తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఇండియాకే చెందిన మరో జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్(81.56 మీటర్లు) ఆరోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ ప్రదర్శనతో కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 23కు చేరుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement