breaking news
july 25th
-
హరికృష్ణకు మూడో ‘డ్రా’
చెన్నై: బీల్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో పెంటేల హరికృష్ణ తన ‘డ్రా’ల పరంపర కొనసాగిస్తున్నాడు. నోయెల్ స్టడర్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో సమ ఉజ్జీగా నిలిచిన హరికృష్ణ టోర్నీలో వరుసగా మూడో డ్రా నమోదు చేశాడు. 52 ఎత్తుల తర్వాత ఈ పోరు ముగిసింది. ప్రస్తుతం 13.5 పాయింట్లతో హరి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రేపటినుంచి చెస్ ఒలింపియాడ్ ఈ నెల 25న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఆన్లైన్లో జరిగే ఈ టోర్నమెంట్ పురుషుల, మహిళల విభాగాలతో పాటు జూనియర్ బాలుర, బాలికల విభాగాల్లో భారత్ పాల్గొంటుంది. ఈ టోర్నీ ఆగస్టు 30 వరకు జరుగుతుంది. పురుషుల జట్టులో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ ఉండగా... సారథిగా విదిత్ సంతోష్ గుజరాతి వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీలో పురుషుల ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) పాల్గొనడం లేదు. ఇక మహిళల విభాగంలో ప్రస్తుత ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక భారత్కు ప్రాతినిథ్యం వహించనున్నారు. టాప్–8లో నిలిచిన జట్లు స్టేజ్–2కు అర్హత సాధిస్తాయి. -
నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
జేఎన్టీయూ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్–2016 కౌన్సెలింగ్ సోమవారం నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆష్రప్ ఆలీ తెలిపారు. ఎస్కేయూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురంలో రెండు హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజనల్ మార్క్స్కార్డులతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలన్నారు. -
జూలై25న నారారోహిత్ బర్త్డే