IND vs SA: ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. వేదిక‌ల‌ను ఖరారు చేసిన బీసీసీఐ

BCCI confirms venues and schedule for five match T20I series - Sakshi

ఐపీఎల్‌-2022 ముగిసిన వెంట‌నే టీమిండియా స్వదేశాన ద‌క్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల ఆడ‌నుంది. ఈ సిరీస్ జాన్ 9న ప్రారంభమై.. జూన్ 19న ముగియ‌నుంది. దీనికి సంబంధించిన షెఢ్యూల్‌, వేదిక‌ల‌ను శుక్ర‌వారం బీసీసీఐ ఖరారు చేసింది. తొలి రెండు టీ20లు ఢిల్లీ, క‌ట‌క్‌లు వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి.

ఇక మూడో టీ20 విశాఖలో జ‌ర‌గ‌నుండగా.. అఖ‌రి రెండు టీ20లు రాజ్‌కోట్‌, బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. ఇక సిరీస్ అనంత‌రం టీమిండియా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. గ‌తేడాది ఐదు టెస్టుల సిరీస్‌లో వాయిదా ప‌డిన టెస్టును భార‌త్ ఆడ‌నుంది.

చ‌ద‌వండి: IPL 2022: తొలి బంతికే డ‌కౌట్‌..కోహ్లికి ఏమైంది.. త‌ల‌దించుకుని పెవిలియ‌న్‌కు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top