న్యూస్రీల్
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
గణపతి నవరాత్రిఉత్సవాల్లో భాగంగా
పర్యావరణ పరిరక్షణకు చాలా మంది భక్తులు మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి, పూజించే వారిని ‘సాక్షి’ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మట్టి వినాయకులను పూజించే భక్తులు సెల్ఫీ తీసుకుని ‘సాక్షి’కి పంపిస్తే, వారి ఫొటోలను ప్రచురించనున్నాం. వాట్సాప్ 9949849479కు పంపించండి మరి..
● డెంగీ నిర్ధారణకు గ్రామాల్లో జ్వర సర్వే
● విపరీతంగా పెరుగుతున్న దోమల ఉధృతి
గ్రామాల్లో అనుమానిత కేసులు
జిల్లాలో డెంగీ వ్యాధి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలు, వాతావరణ మార్పుల పరిస్థితుల నేపథ్యంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 42 డెంగీ కేసులు నమోదు కాగా అప్రమత్తమైన వైద్యశాఖ ఇంటింటికీ జ్వర సర్వేను చేపట్టింది. మూడు రోజుల్లో తగ్గకపోతే రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
– సంగారెడ్డి జోన్


