పటాన్చెరుటౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం పెద్దచెరువులో చేపలు మృత్యువాత పడిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకుని సమీపంలోని పరిశ్రమల నుంచి వ్యర్థజలాలను చెరువులోకి వదిలివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చెరువులోని నీరు కలుషితమై చేపలు చనిపోయాయని వారు మండిపడ్డారు. సంబంధిత అధికారులు వెంటనే నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి, కారణమైన పరిశ్రమల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాలుష్య జలాలే కారణమా?


