రైతుల్లో చైతన్యం నింపాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల్లో చైతన్యం నింపాలి

Jul 21 2026 7:22 AM | Updated on Jul 21 2026 7:22 AM

ల్‌నినో ప్రభావంతో తలెత్తే ప్రతికూల పరిస్థితులను ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఎదుర్కొవాలి. ఇందుకోసం సంబంధితశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఎల్‌నినో అనేది ప్రకృతి విపత్తు అని దీన్ని ఎవరూ ఆపలేరు. దీని ప్రభావంతో జరిగే నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. వరి వంటి నీటి అవసరాలు అధికంగా ఉన్న పంటలకు బదులుగా ఆయిల్‌పామ్‌ వంటి ఆరుతడి పంటల విస్తీర్ణం పెంచేందుకు రైతుల్లో చైతన్యం నింపాలి. ఇందుకోసం సోషల్‌ మీడియా రీల్స్‌, కళాజాతలు, నాటక ప్రదర్శనలను వినియోగించాలి. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. భూగర్భజలాలు పెంచేందుకు ఇంకుడుగుంతలు తవ్వుకునేలా ప్రజలను చైతన్యం చేయాలి.

– వివేక్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి

సమన్వయంతో పనిచేయాలి

తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సింగూరు నీటిని ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకే వినియోగించాలి. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. మున్సిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయంగా ముందస్తు ప్రణాళికను అమలు చేయాలి. పీఎం సూర్యఘర్‌ వంటి పథకాల లబ్ధి సామాన్యులకు అందేలా చర్యలు చేపట్టాలి.

– చిన్నమైల్‌ అంజిరెడ్డి, ఎమ్మెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement