వేడుకలకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

వేడుకలకు పటిష్ట బందోబస్తు

Dec 31 2025 9:55 AM | Updated on Dec 31 2025 9:55 AM

వేడుకలకు పటిష్ట బందోబస్తు

వేడుకలకు పటిష్ట బందోబస్తు

● నిబంధనలు కచ్చితంగా పాటించాలి ● రాత్రంతా విస్తృతంగా వాహనాల తనిఖీ ● సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్‌ ● నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమానికై నా ముందస్తు పోలీసుల అనుమతులు తప్పనిసరి. ● నిషేధిత మత్తు పదార్థాలు గంజాయి వంటి పదార్థాలు విక్రయించినా నేరమే. ● మైనర్ల పట్ల తల్లితండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదు. ● టపాసులు, డీజేలు నిషేధం. ● బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ● పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో వాహనాలు నిలిపి వేడుకలు చేయరాదు. ● మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ● మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో కచ్చితంగా మూసేయాలి. మద్యం దుకాణాల్లో మైనర్లకు మద్యం అమ్మరాదు.

● నిబంధనలు కచ్చితంగా పాటించాలి ● రాత్రంతా విస్తృతంగా వాహనాల తనిఖీ ● సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్‌

సంగారెడ్డి క్రైమ్‌: నూతన సంవత్సర వేడుకల్లో పోలీస్‌ శాఖ సూచనలు, నిబంధనలు కచ్చితంగా పాటించాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 100మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌తో పాటు, ప్రధాన రహదారుల్లో , మహబూబ్‌ సాగర్‌ చెరువు కట్ట, తదితర ప్రాంతాల్లో బందోబస్తు, పెట్రోలింగ్‌ వాహనాలు , డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకలు కుటుంబ సభ్యులు , స్నేహితులతోనే కలిసి ఇంట్లో, అపార్ట్‌మెంట్‌లో జరుపుకోవాలని సూచించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

పాటించాల్సిన నిబంధనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement