విధులకు వెళ్తుండగా ఎదురొచ్చిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
రామచంద్రాపురం(పటాన్చెరు): పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకి చెందిన నికిత(27) కుటుంబ సభ్యులతో కలిసి మండలంలోని నందిగామలో నివాసముంటున్నారు. హైదరాబాద్లోని ఓ ల్యాబ్లో విధులు నిర్వహిస్తుండగా.. రోజులాగే విధులకు ఉదయం స్కూటీపై బయలుదేరింది. అయితే స్థానిక పట్టణ పరిధిలోని ఇక్రిశాట్ సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు స్కూటీ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు ఆపకుండా వెళ్లినట్లు సమాచారం వచ్చిందని పోలీసుల తెలిపారు. మృతిరాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి
కంది(సంగారెడ్డి): స్కూటీతో చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కంది శివారులో బెంగళూరు బైపాస్ రోడ్డుపై చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. ఇస్నాపూర్కు చెందిన ఒగ్గు రామరావు(35) ఓ ప్రైవేటు పరిశ్రమ లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం మండల కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తుండగా.. బెంగళూరు బైపాస్ రోడ్డులోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును స్కూటీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
విధులకు వెళ్తుండగా ఎదురొచ్చిన మృత్యువు


