దత్తగిరిలో ప్రత్యేక పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రమైన బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు 108 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్, డా.సిద్దేశ్వర్స్వామి ఆధ్వర్యంలో పూజలు కొనసాగాయి. ఆశ్రమ ఆవరణలోని పంచమహావృక్షాల వద్ద వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దత్తహోమం, యజ్ఞం, పూర్ణాహుతి చేశారు. జ్యోతిర్లింగాల వద్ద స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో జహీరాబాద్ డీఎస్పీ రఘు, రూరల్ సీఐ వెంకటేశం, ఎస్ఐ రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి, పూలమాల, శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయమాత, విగ్రహ దాత సంజీవ్ కుటుంబ సభ్యులు, అర్చకులు, వైదిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.