కొడంగల్: పట్టణంలో హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ కిచెన్ షెడ్ ఆధునీకరణకు అరబిందో ఫార్మా కంపెనీ విరాళం అందించింది. ఈ మేరకు కంపెనీ మేనేజింగ్ ట్రస్టీ నిత్యానందరెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.10 కోట్ల చెక్కును సీఎం రేవంత్రెడ్డికి గురువారం హైదరాబాద్లో అందజేశారు. ఈ మొత్తంలో రూ.4కోట్లు కొడంగల్ కేంద్రీయ వంటశాలకు, మిగిలిన రూ.6 కోట్లు సంగారెడ్డికి ఇచ్చారని హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.


