నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

టీజీఎస్‌పీడీసీఎల్‌ జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ పాండ్యనాయక్‌

రూ.2.5 కోట్లతో జిల్లాలో తొలి పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు

పహాడీషరీఫ్‌: విద్యుత్‌ వినియోగదారులకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు టీజీఎస్‌పీడీసీఎల్‌ చర్యలు తీసుకుంటుందని సంస్థ జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ పాండ్యనాయక్‌ అన్నారు. గురువారం జల్‌పల్లి సర్కిల్‌లోని వాదే హుదా సబ్‌స్టేషన్‌లో 16 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ సమస్యలను అధిగమించేందుకు జిల్లాలో తొలిసారిగా 33 కేవీ ఉప కేంద్రంలో రూ.2.5 కోట్లు వెచ్చించి ఈ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ని ఏర్పాటు చేశామన్నారు. వాదే ముస్తఫా, గౌస్‌నగర్‌, అలీనగర్‌, నూరీనగర్‌, ఇస్మాయిల్‌ నగర్‌, బాబానగర్‌, ఎర్రకుంట, క్యూబా కాలనీలలోని దాదాపు 12 వేల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్‌ ఎస్‌ఈ శ్రీరామ్‌ మోహన్‌, కందుకూరు డీఈ గోపాల కృష్ణ, ఎంఆర్టీ డీఈ భాస్కర్‌, లైన్స్‌ డీఈ చంద్రశేఖర్‌, ఏడీఈలు శంకర్‌, స్వాతి, రామలింగారెడ్డి, ఏఈలు సుమన్‌, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement