
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
● భూ భారతి చట్టంపై విస్తృత ప్రచారం ● ఆధార్లా భూమికి భూధార్ సంఖ్య ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● బోయినపల్లిలో అవగాహన సదస్సు
బోయినపల్లి(చొప్పదండి): భూ సమస్యల సత్వర పరిష్కారానికి ధరణి స్థానంలో వచ్చిన భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రైతువేదిక భవనంలో భూభారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) కొత్త ఆర్వోఆర్ చట్టం 2025పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతనచట్టంపై ఈనెల 17 నుంచి 29 వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. భూసమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ద్వారా ఆర్డీవోలు, కలెక్టర్ల నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. ఽగతంలో ఉన్న ధరణిలో రికార్డుల్లో సవరణకు అవకాశం లేదని, సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిందేనని గుర్తుచేశారు. అప్పీల్ వ్యవస్థతో సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టులకు వెళ్లవచ్చన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో గ్రామపరిపాలన అధికారులను నియమిస్తారని, ఆధార్కార్డు లాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపుతో భూఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. ఎకరం భూమి మ్యూటేషన్కు రూ.2500 ఫీజు చెల్లించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాధాభాయి, రాజేశ్వర్, తహసీల్దార్ నారాయణరెడ్డి, డీటీ భూపేశ్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టేపెల్లి సుధాకర్, ఎంపీడీవో భీమ జయశీల, ఎంఏవో ప్రణిత తదితరులు పాల్గొన్నారు.
‘భూ భారతి’పై అవగాహన సదస్సులు
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ‘భూ భారతి’పై మండల స్థాయిలో అవగాహన సదస్సులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా నిర్వహిస్తున్నారు. ఈనెల 19న ఇల్లంతకుంట, 21న కోనరావుపేట, 22న రుద్రంగి, చందుర్తి, 23న వేములవాడ, వేములవాడరూరల్, 24న గంభీరావుపేట, 25న ముస్తాబాద్, 26న తంగళ్లపల్లి, 28న సిరిసిల్ల, 29న ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు.