
ఉద్యోగ భద్రత కల్పించాలి
సిరిసిల్లటౌన్: వెట్టిచాకిరితో సతమతమవుతూ పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్ల ఉద్యోగాలు రెగ్యులరై జ్ చేసి భద్రత కల్పించాలని ప్రభుత్వ పాఠశాల స్వీ పర్స్, స్కావెంజర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జి ల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్యాదవ్ డిమాండ్ చేశా రు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. పెండింగ్లో ఉంటున్న స్కా వెంజర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కో రారు. ఏడాదికి రెండుజతల యూనిఫామ్స్ ఇవ్వాల ని, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఎఫ్, ఈ ఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. స్కావెంజర్ల ఖాతాల్లోనే జీతాలు ప్రతినెల 5లోపు జ మ చేయాలని, ఏడాదిలో పదినెలలు కాకుండా ప న్నెండు నెలలు జీతాలివ్వాలని కోరారు. వారి సమస్యలను వివరిస్తూ కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందించారు. నర్సవ్వ, పి.పర్శరాములు, లత, కొమురవ్వ, ఇందిర, రాజీవ, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.