న్యూస్రీల్
సిండికేట్ దెబ్బకు ఆక్వా రైతు విలవిల ధరలు తగ్గించి నిలువు దోపిడీ భారీగా పడిపోతున్న రేట్లు ఎల్నినో ప్రభావంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం వ్యాధులతో రొయ్యలు మృత్యువాత.. పెరిగిన సాగు ఖర్చులు రైతుల కష్టాన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారుల సిండికేట్ జిల్లాలో 18 వేల ఎకరాల్లో ఆక్వా సాగు
చంద్రబాబు నైజం..వెన్నుపోటు
సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టు కోకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే బూచేపల్లి విమర్శించారు.
ఆక్వా సాగుపై నీలి నీడలు అలముకున్నాయి. రైతుల కష్టాన్ని సిండికేట్ అడ్డగోలుగా దోచేస్తోంది. గతంలో అమెరికా సుంకాల పెంపును సాకుగా చూపి రొయ్యల ధరలను భారీగా తగ్గించిన వ్యాపారులు.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోయినా మరోసారి ధరలపై దొంగాట మొదలెట్టేశారు. రైతులు తమ పంటలను సాగు చేయడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తుంటే వ్యాపారులు మాత్రం పంట చేతికొచ్చే సమయంలో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను తగ్గిస్తుండటంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. దీంతో ఏళ్లుగా రొయ్యలు సాగుపై ఆధారపడిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ధర దిగజారి..
రొయ్య చేజారి!


