కేసీఆర్‌ ఈసారైనా నిజాలు మాట్లాడతారని భావిద్దాం

YSRTP YS Sharmila Slams Telangana CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాత అబద్ధాలను ప్రచా­రం చేస్తూ, కొత్త అబ­ద్ధాలతో ప్రజలను నమ్మిం­చే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖమ్మం సభలోపు అయినా నిజాలు మాట్లా­డతారని భావిద్దామని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు.

భవిష్యత్తేలేని బీఆర్‌ఎస్‌ ఎజెండాను దేశంపై రుద్దేందుకు తమ స్వార్థ రాజకీయాలను దేశవ్యాప్తం చేయడానికి ఖమ్మం జిల్లాలో సభ నిర్వహించడం హాస్యాస్పదమని వై.ఎస్‌.­షర్మిల విమర్శించారు. ఈ మేరకు జిల్లాలో నెలకొన్న పది సమస్యలపై టీఆర్‌ఎస్‌ను ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్‌కు మంగళవారం వై.ఎస్‌.షర్మిల బహిరంగ లేఖ రాశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top