బ్లాక్‌మెయిల్ ఛానల్స్‌ని బహిష్కరించాలి: ఎంపీ విజయసాయిరెడ్డి | YSRCP MP Vijayasai Reddy Serious Comments On Mahaa News, Tweets Goes Viral | Sakshi
Sakshi News home page

‘మహా చెత్త న్యూస్’.. బ్లాక్‌మెయిల్ ఛానల్స్‌ని బహిష్కరించాలి: ఎంపీ విజయసాయిరెడ్డి

Jul 22 2024 8:58 AM | Updated on Jul 22 2024 10:05 AM

YSRCP MP Serious Comments On Mahaa News

సాక్షి, ఢిల్లీ: మహా న్యూస్‌ ఛానెల్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మహా చెత్త న్యూస్‌..‘కాకినాడ రైస్ మిల్లర్ల దందా’ ప్రోమో సంగతి ఏమైందని ప్రశ్నించారు. బ్లాక్‌మెయిల్‌ ఛానళ్లను ప్రజలు బహిష్కరించాలని కోరారు.

కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘మహా చెత్త న్యూస్.. టాల్కమ్ డబ్బా పౌడర్ బ్లాక్ మైలర్‌కి కాకినాడ రైస్ మిల్లర్లు, ఎక్స్‌పోర్టర్లు నుండి 50 లక్షలు వెళ్లాయి. ‘కాకినాడ రైస్ మిల్లర్ల దందా’ అని చెప్పి ఒక ప్రోమో రిలీజ్ చేసి, నేనే వస్తున్నా, అక్రమాలన్నీ బయట పెడుతున్నా అని బెదిరించి.. వారి నుండి 50 లక్షలు తీసుకున్నాడు. ఇలాంటి బ్లాక్ మెయిల్ ఛానళ్లని ప్రజలు బహిష్కరించి సంబంధిత బ్లాక్ మెయిల్ రిపోర్టర్లకు తగిన ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి’ అని కామెంట్స్‌ చేశారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement