‘విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా?’ | YSRCP MP Mithun Reddy Takes On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా?’

Jul 8 2025 8:11 PM | Updated on Jul 9 2025 7:02 AM

YSRCP MP Mithun Reddy Takes On Chandrababu Govt

నెల్లూరు : మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ ఇంటిపై టీడీపీ శ్రేణులు చేసిన దాడిన ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అప్రజాస్వామికమని మండిపడ్డారు. విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా? అని ప్రశ్నించారు మిథున్‌రెడ్డి. ఈరోజు(మంగళవారం, జూలై 8వ తేదీ) ప్రసన్న కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు మిథున్‌రెడ్డి. 

దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసన్న కుమార్‌ రెడ్డి నివాసంలో ఏ వస్తువును వదిలిపెట్టలేదని,. ఈ విషయంలో పోలీస్‌ శాఖ స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. రెడ్‌ బుక్‌ ఇవాళ అమలైతే.. తాము కూడా ఓ బుక్‌ ఓపెన్‌ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రసన్న కుమార్‌రెడ్డికి తమ నాయకుడు వైఎస్‌ జగన్‌తో పాటు పార్టీ క్యాడర్‌ కూడా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement