వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం‌.. ఖండించిన వైఎస్సార్‌సీపీ | Yellow Media Fake Campaign On MP YV Subba Reddy | Sakshi
Sakshi News home page

వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం‌.. ఖండించిన వైఎస్సార్‌సీపీ

Aug 12 2024 9:18 PM | Updated on Aug 13 2024 11:10 AM

Yellow Media Fake Campaign On MP YV Subba Reddy

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ ఖండించింది. గోబెల్‌ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా? అన్ని ప్రశ్నించింది. బొత్స సత్యనారాయణ నామినేషన్‌ సందర్భంగా స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే వైవీ సుబ్బారెడ్డి లోపలికి వెళ్లలేదని స్పష్టం చేసింది.

కాగా, వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా..‘నామినేషన్‌ వేసేటప్పుడు నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురికి మాత్రమే ప్రవేశం. స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సుబ్బారెడ్డి లోపలికి వెళ్లలేదు. నిజాలు ఇలా ఉంటే.. దానికి వక్రీకరణలు జోడించి ఎల్లో మీడియా అబద్ధాలు ప్రసారం చేసింది. గోబెల్స్‌ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా?’ అని ప్రశ్నించింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement