TPCC Chief Revanth Reddy Reaction On Munugode Bypoll Results - Sakshi
Sakshi News home page

మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

Nov 7 2022 2:19 AM | Updated on Nov 7 2022 10:31 AM

TPCC Chief Revanth Reddy Reaction Munugode Bypoll Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యావత్ తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరభవం చవిచూసింది. డిపాజిట్ కూడా దక్కించుకోలేేక మూడో స్థానానికి పరిమితమైంది. ఈ పరాజయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని రేవంత్ పేర్కొన్నారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా, నికార్సుగా, నిబద్ధతగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ 10వేలకుపైగా మెజార్టీతో ఘన విజయం సాధించింది. విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి పరాజయం పాలై రెండో స్థానంలో నిలిచారు.
చదవండి: ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్‌ఎస్ జయకేతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement