రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి లోబడే పాలన | Perni Nani Fires on Nara Lokesh Announced Redbook | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి లోబడే పాలన

Aug 6 2024 6:25 AM | Updated on Aug 6 2024 7:44 AM

Perni Nani Fires on Nara Lokesh Announced Redbook

కలెక్టర్ల సమావేశంలోనూ హామీల ప్రస్తావన లేదు

మాజీమంత్రి పేర్ని నాని ఫైర్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండు నెల­లుగా అంబేడ్కర్‌ రాజ్యాంగం బదులు.. నారా లోకేశ్‌ ప్రకటించిన రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో కూట­మి ప్రభుత్వం శాంతి­భద్రతలను కాపాడే పోలీసులను కొత్త పోకడలతో నడిపించే పరిస్థితి కనిపిస్తోందని ఆయనన్నారు. గతంలో ఎప్పుడూలేని పోకడలు రెండు నెలలుగా రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పారు.

తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడా­రు. గతంలో యూపీ, బిహార్‌లో ఇలా ప్రభు­త్వ ప్రేరేపిత హింసను చూశా­మని.. ఇప్పుడా పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్నారు. పో­లీ­సుల సమక్షంలోనే ఇదంతా జరుగుతోందని.. చివరకు వారి­పైనా దాడులు జరు­గు­తున్నా­యన్నారు. ఇంత జరుగు­తు­న్నా, డి­ప్యూటీ సీఎం పవ­న్‌­­కల్యాణ్‌ నోరు మెదపడంలేదని ఆ­క్షేపించారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారా­మా­పురంలో జరిగిన దారుణ హత్య అత్యంత హేయమని చెప్పారు. ‘రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ఓ రిటైర్డ్‌ డీజీపీ, రిటైర్డ్‌ ఐజీ ఇద్దరూ కలిసి అమలుచేస్తున్నారు. 

జగ్గయ్య­పేటలో గంజిపల్లి శ్రీనివాస్‌పై పచ్చమూకలు అత్యంత దారుణంగా దాడికి తెగబడ్డాయి.   సీతారామాపురం హత్య ఘటనపై కూటమి ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలి. ఇక వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో నాటి సీఎం జగన్‌ పార్టీలకతీతంగా, అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు­చేయాలని చెప్పారు. కానీ, సోమవారం నాటి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రాజకీయ పార్టీ తరహాలోనే ప్రభుత్వాన్ని నడుపుతామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల హామీల గురించి ప్రస్తావించలేదు’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement