అధికారమే లక్ష్యంగా కొట్లాడండి  | Mynampally Hanumantha Rao Meets Rahul Gandhi At Delhi | Sakshi
Sakshi News home page

అధికారమే లక్ష్యంగా కొట్లాడండి 

Sep 30 2023 3:10 AM | Updated on Sep 30 2023 3:10 AM

Mynampally Hanumantha Rao Meets Rahul Gandhi At Delhi - Sakshi

శుక్రవారం ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో భేటీ అయిన మైనంపల్లి. చిత్రంలో ఠాక్రే, రేవంత్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా కొట్లాడాలని ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర నేతలకు సూచించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ సహా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మేడ్చల్‌ నేత నక్కా ప్రభాకర్‌ గౌడ్, భువనగిరి నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ థాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు.

నేతలందరినీ రాహుల్‌కు రేవంత్‌ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి నేతలను ఆహ్వనించిన రాహుల్, వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఇప్పటికే పార్టీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే పార్టీ విజయం తథ్యమన్నారు. కొత్త, పాత తారతమ్యాలను పక్కనపెట్టి నేతలంతా ఒక్కటిగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement