‘చంద్రబాబు.. నీ హయాంలో పేదలకు అర సెంటు స్థలమైనా ఇచ్చావా?’ | MP Krishnaiah Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు.. నీ హయాంలో పేదలకు అర సెంటు స్థలమైనా ఇచ్చావా?’

May 21 2023 6:31 PM | Updated on May 21 2023 6:36 PM

MP Krishnaiah Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఉచితంగా సెంటు స్థలం ఇస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు.

చంద్రబాబు.. నీ హయాంలో పేదలకు అరసెంటు స్థలమైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలమంటే చంద్రబాబుకు ఎందుకంత చులకని అని ఆర్‌. కృష్ణయ్య నిలదీశారు. ప్రతీ పేదవాడి కల సెంటు స్థలం సాధించుకోవటమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement