ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా: ఎంపీ అసదుద్దీన్‌ | MP Asaduddin Owaisi Slams BJP And Raja Singh In Telugu Tweets | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా?: ఎంపీ అసదుద్దీన్‌

Aug 25 2022 4:07 PM | Updated on Aug 25 2022 4:45 PM

MP Asaduddin Owaisi Slams BJP And Raja Singh In Telugu Tweets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎఐఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా? అని మండిపడ్డారు. బీజేపీ తీరు ఇప్పుడే ఇలా ఉంటే సార్వత్రిక ఎ‍న్నికల నాటికి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు.

దుకాణాలు, పాఠశాలలు మూయించి, ప్రజలను బయటకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. అల్లా దయతో ఇవన్నీ జరగకూడదని, తెలంగాణ రాష్ట్ర బీజేపీ సృష్టిస్తున్న హింసకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దామన్నారు. 
చదవండి: Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

ఇదిలా ఉండగా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై షాహినాయత్‌ గంజ్‌లోని ఆయన ఇంట్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారీ భద్రత నడుమ రాజాసింగ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాజాసింగ్‌కు వైద్య పరీక్షలు చేశారు. తర్వాత చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది. 
చదవండి: Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement