చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు: ఆళ్ల నాని | Minister Alla Nani Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు: ఆళ్ల నాని

Jun 29 2021 4:46 PM | Updated on Jun 29 2021 5:07 PM

Minister Alla Nani Fires On Chandrababu - Sakshi

చంద్రబాబు రోజురోజుకు దిగజారిపోతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు.

సాక్షి, అమరావతి: చంద్రబాబు రోజురోజుకు దిగజారిపోతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కరోనా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని.. చంద్రబాబు, లోకేష్‌ మాత్రం జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

కరోనా నివారణ చర్యల్లో ఏపీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఐసీఎంఆర్‌ ప్రొటోకాల్స్‌ తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘సీఎం జగన్‌పై బురద జల్లేందుకే చంద్రబాబు కుట్రలు’ అంటూ మంత్రి ఆళ్ల నాని నిప్పులు చెరిగారు.

చదవండి: ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కన్నబాబు
దేశంలో ఎక్కడా లేని విధంగా.. ‘నాడు-నేడు’కు 11 వేల కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement