సుప్రీంను ఆశ్రయించిన మహువా | Mahua Moitra Challenges Expulsion From Lok Sabha In SC | Sakshi
Sakshi News home page

లోక్‌సభ సభ్యత్వం రద్దు.. సుప్రీంను ఆశ్రయించిన మహువా

Dec 11 2023 2:18 PM | Updated on Dec 11 2023 2:25 PM

Mahua Moitra Challenges Expulsion From Lok Sabha In SC - Sakshi

ముడుపులు తీసుకుని అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ మహువా అభియోగాలు వచ్చాయి.

సాక్షి, ఢిల్లీ: టీఎంసీ నేత మహువా మొయిత్రా  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ఆమె కోర్టులో సోమవారం ఒక పిటిషన్‌ వేశారు. ఆధారాల్లేకుండా, వచ్చిన ఆరోపణలపై సరైన దర్యాప్తు చేయకుండానే తనపై చర్యలు తీసుకున్నారంటూ ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.

ముడుపులు తీసుకుని అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఆమె ప్రశ్నలు అడిగారంటూ అభియోగాలు వచ్చాయి. ఆ అభియోగాలపై విచారణ జరిపిన పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ ‘నిజమేనని’ నివేదిక సమర్పించగా.. పార్లమెంట్‌లో చర్చ జరిగిన తర్వాత లోక్‌సభ స్పీకర్‌ డిసెంబర్‌ 8వ తేదీన మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్‌ ముందు వరకు ఆమె పశ్చిమ బంగాల్‌లోని కృష్ణా నగర్ ఎంపీగా ఉన్నారు.  

క్యాష్ ఫర్ క్వరీ కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సంబంధించిన తీర్మానానికి అనుకూలంగా సభ్యులు ఓటు వేసిన తర్వాత లోక్‌సభలో హై డ్రామా నడిచింది. ఎంపీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో మొయిత్రా పార్లమెంట్ నుండి బహిష్కరించబడ్డారు. అదే సమయంలో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసారు.

‘‘కేసు మూలాలను తీసుకోకుండానే ఎథిక్స్ కమిటీ నన్ను ఉరితీయాలని నిర్ణయించింది. సాక్ష్యమివ్వడానికి వ్యాపారిని పిలవడానికి అది నిరాకరించింది. ఈ కేసులో ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పీఈ దాఖలు చేసింది అని ఆమె వేటు సందర్భంగా వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement