రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది | Kakani Govardhan Reddy Fires On Nara Lokesh Redbook, Check His Comments Inside | Sakshi
Sakshi News home page

రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది

Aug 7 2024 5:55 AM | Updated on Aug 7 2024 1:52 PM

Kakani Govardhan Reddy Fires on Lokesh Redbook

లోకేశ్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది

హత్యలు చేయడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘గత ప్రభుత్వంలో వేసిన అభివృద్ధి శిలాఫలకా­లను టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వంసం చేస్తు­న్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎవరైతే శిలా­ఫలకాలను కూల్చివేస్తారో.. మళ్లీ వాళ్లేతోనే నిర్మింప­జే­స్తాం. టీడీపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీల అమ­లుకు కృషి చేయాలి. లేకపోతే ప్రజ­లకు అండగా నిలిచి.. పోరాటం చేస్తాం’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు.  ఆయన మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాజకీయ హత్య­లతో రాష్ట్రం అట్టుడికిపోతోందని.. లోకేశ్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడిపి­స్తు­న్నా­డని కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండి­పడ్డారు. ‘ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చడం కుదరదని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. 

మైసూర్‌ బోండాలో మైసూర్‌లాగా.. ఉచిత ఇసుకలో ఉచితం కన్పిస్తోంది. ఉచిత ఇసుక ఇస్తున్నట్లు చంద్రబాబు రోజూ ఊకదంపుడు ఉపన్యా­సాలు ఇస్తున్నారు. ఆ ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతుందో చంద్రబాబుకే తెలియా­లి. టీడీపీ మూకలు మాత్రం ఇసుక రేవుల్లో పడి ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. రాష్ట్రంపై రూ.14 లక్షల కోట్ల అప్పు భారం ఉందంటూ రచ్చ చేసిన చంద్రబాబు.. గవర్నర్‌ ప్రసంగంలో మాత్రం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పించారు. ఇష్టారీతిన హామీ­లు ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా అప్పుల గురించి? అవినీతి, అక్రమాలకు పాల్ప­డుతున్న ఎమ్మె­ల్యేలు చెప్పిన­ట్లుగా నడుచు­కోవా­లని కలెక్టర్లు, ఎస్పీలకు చెప్పడం ద్వారా చంద్రబాబు కూడా అవినీతికి వంతపాడుతున్నారు. దాడులు, అవినీతి, అక్రమాల్లో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు’ అని కాకాణి ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement